Sajjanar: శెభాష్.. స్మార్ట్ఫోన్ ముట్టుకోకుండా సివిల్స్ కొట్టావమ్మా: సజ్జనార్ ప్రశంస

Play all audios:

ఇటీవల యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో 11వ ర్యాంకుతో అదరగొట్టిన ఇట్టబోయిన సాయి శివానిని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అభినందించారు. By Features Desk Published : 29 May 2025 18:13 IST Ee
Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE 1 min read హైదరాబాద్: ఇటీవల యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో 11వ ర్యాంకుతో అదరగొట్టిన ఇట్టబోయిన సాయి శివానిని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ
సజ్జనార్ అభినందించారు. సాధారణ కుటుంబానికి చెందిన సాయి శివాని.. సివిల్స్లో చిన్న వయసులోనే అత్యుత్తమ ర్యాంకు సాధించి యువతకు స్పూర్తిగా నిలిచారని కొనియాడారు. నేటి డిజిటల్ యుగంలో
స్మార్ట్ ఫోన్ ముట్టుకోకుండా, సోషల్ మీడియా జోలికి వెళ్లకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించారంటూ ప్రశంసలు కురిపించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ఉన్నతంగా రాణించాలని ఆమెకు
సూచించారు. సివిల్స్ ర్యాంకర్ సాయి శివాని మేనమామ ప్రకాశ్ రావు ఆర్టీసీలో డీఎం హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని బస్ భవన్లో గురువారం ఆమె తన కుటుంబ
సభ్యులతో వచ్చి సజ్జనార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు రాజు, రజితతో పాటు సాయి శివానిని సజ్జనార్ సత్కరించారు. అనంతరం ఈ ఫొటోలను సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో
షేర్ చేశారు. గమనిక: _ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర
ప్రత్యుత్తరాలకి తావు లేదు._