Ap liquor scam: ఏసీబీ కోర్టుకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి

Ap liquor scam: ఏసీబీ కోర్టుకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి

Play all audios:


మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన సీఎంవో మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కె.ధనుంజయరెడ్డి (ఏ31), ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి (ఏ32)ని సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు.


విజయవాడ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన సీఎంవో మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కె.ధనుంజయరెడ్డి (ఏ31), ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి (ఏ32)లను సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టుకు


తరలించారు. వారిద్దరినీ జడ్జి ఎదుట హాజరు పరిచారు. అంతకుముందు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటివరకు ఏడుగురిని సీఐడీ అరెస్టు


చేసింది. ఇప్పటికే రాజ్‌ కెసిరెడ్డి, చాణక్య, సజ్జల శ్రీధర్‌రెడ్డి, దిలీప్‌, గోవిందప్ప, బాలాజీలను అరెస్టు చేసిన సీఐడీ.. శుక్రవారం రాత్రి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని అరెస్టు చేసింది. ఈ


కేసులో వీరిద్దరూ కీలకంగా వ్యవహరించినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు.