Stock market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@24,800

Stock market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@24,800

Play all audios:


Stock Market Opening Bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు.. ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌


ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్లతో సూచీలు రాణిస్తున్నాయి. దీంతో ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 220 పాయింట్ల లాభంతో 81,515 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ


(Nifty) 49 పాయింట్ల లాభంతో 24,801 వద్ద ఉన్నాయి.  సెన్సెక్స్‌ 30 సూచీలో.. టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, సన్‌ఫార్మా, టాటా


స్టీల్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్‌,


నెస్లే ఇండియా షేర్లు మాత్రమే నష్టాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ 65.64 డాలర్ల వద్ద.. బంగారం ఔన్సు 3,274 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  * జూన్‌ 25 కల్లా


మధ్యంతర ఒప్పందం! అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. నాస్‌డాక్‌ 0.51 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500.. 0.56 శాతం, డోజోన్స్ 0.58 శాతం నష్టపోయాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు లాభాల్లో


ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ 1.68 శాతం, ఆస్ట్రేలియన్‌ ఏఎస్‌ఎక్స్‌ 0.34 శాతం, హాంగ్‌సెంగ్‌ 0.54 శాతం, షాంఘై 0.71 శాతం లాభంతో కదలాడుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం నికరంగా


రూ.4,663 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.7,912 కోట్ల షేర్లును కొనుగోలు చేశారు.