Trade deal: త్వరలో భారత్తో ట్రేడ్ డీల్: అమెరికా వాణిజ్య మంత్రి

Play all audios:

భారత్తో సమీప భవిష్యత్తులో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా వాణిజ్య మంత్రి పేర్కొన్నారు. ఇంటర్నెట్డెస్క్: భారత్తో ట్రేడ్ డీల్ మరెంతో దూరంలో లేదని అమెరికా వాణిజ్య
శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఆశాభావం వ్యక్తంచేశారు. వాషింగ్టన్లో జరిగిన భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక నాయకత్వ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాలు సమష్టిగా ప్రయోజనాలను
గుర్తించాయని పేర్కొన్నారు. ఇరుదేశాల చర్చలు చివరిదశకు చేరిన వేళ ఈ వ్యాఖ్యలు వెలువడటం విశేషం. ఇవి సుదీర్ఘకాలంగా జరుగుతున్న చర్చలను ముందుకుతీసుకెళ్లినట్లు వెల్లడించారు. ‘‘సమీప భవిష్యత్తులోనే
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాన్ని మీరు ఆశించవచ్చు. భారత్ సరైన వ్యక్తిని ఎంపిక చేసి పంపిస్తే.. మా నుంచి చర్చలకు తగిన వ్యక్తిని పంపిస్తాం. అమెరికాతో ముందు ద్వైపాక్షిక ఒప్పందాలు
చేసుకొన్న దేశాలకు మెరుగైన డీల్ లభిస్తుంది. జులై 4 నుంచి 9లోపు వచ్చే వారికి ఆ అవకాశం అందుకోవచ్చు’’ అని లుట్నిక్ వ్యాఖ్యానించారు. భారత్ కూడా ఈ వాణిజ్య ఒప్పందంపై ఆశాభావంగా ఉంది. ఇప్పటికే
ప్రతిపాదిత ఒప్పదంపై న్యూదిల్లీ చురుగ్గా పనిచేస్తోంది. దీనిపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ‘‘ఇరుదేశాలు కలిసి పనిచేయడంపై ఓ అభిప్రాయానికి వచ్చాయి. పరస్పరం మార్కెట్లలోకి
ఇరుదేశాల వ్యాపారాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై పనిచేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా నుంచి వచ్చిన ఓ బృందం న్యూదిల్లీలో
పర్యటిస్తోంది. ఈక్రమంలో చర్చలను ముందుకుతీసుకెళ్లి.. జూన్ చివరికి వీటిని ఓ కొలిక్కి తేనున్నాయి. 26శాతం ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు కోసం భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కొన్ని నెలల
క్రితం ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఇరుదేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 191 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.