Rahul gandhi: వారిని కించపరిచే హక్కు మీకు లేదు: రాహుల్పై హైకోర్టు మండిపాటు

Play all audios:

దిల్లీ: కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో భారత ఆర్మీని ఉద్దేశిస్తూ ఆయన
చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాహుల్కు చురకలు అంటించింది. మన సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడే హక్కు లేదని పేర్కొంది. దేశంలో భారత
జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ.. ‘‘దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్ల భారత భూగాన్ని చైనా స్వాధీనం చేసుకుంది. కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న వారు దాని గురించి ఒక్క ప్రశ్న కూడా అడగరు.
అరుణాచల్ప్రదేశ్లో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీని గురించి దేశ మీడియా ప్రశ్నించడం లేదు. ఇది నిజం కాదా..? ఇదంతా యావత్ దేశం గమనిస్తోంది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు
వివాదాస్పదంగా మారాయి. * భాషా వివాద నేపథ్యం.. కమల్హాసన్ రాజ్యసభ నామినేషన్ వాయిదా దీంతో రాహుల్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దేశ సైన్యాన్ని అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తూ అలహాబాద్
హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టింది. ‘‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కల్పించింది. అందులో ఎలాంటి సందేహం
లేదు. కానీ, వాక్ స్వాతంత్ర్యానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. దేశ సైనికులను కించపరిచే హక్కు ఎవరికీ లేదు’’ అని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.