Operation sindoor: పాక్ ఆర్మీ చీఫ్ భారత్‌పై విషం చిమ్మారు - సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌

Operation sindoor: పాక్ ఆర్మీ చీఫ్ భారత్‌పై విషం చిమ్మారు - సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌

Play all audios:


భారత్‌, హిందువులపై పాక్ ఆర్మీ చీఫ్ జనరల్‌ ఆసిం మునీర్‌ విషం చిమ్మారని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాం ఘటనకు (Terrorist attack)


ముందు భారత్‌, హిందువులపై పాక్ ఆర్మీ చీఫ్ జనరల్‌ ఆసిం మునీర్‌ విషం చిమ్మారని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. పాకిస్థాన్‌ (Pakistan) ఉగ్రవాదానికి మద్దతు


ఇస్తోందని, ఇక్కడ రక్తపాతం సృష్టించడమే వారి విధానమని మండిపడ్డారు. ‘భవిష్యత్తు యుద్ధాలు, యుద్ధక్షేత్రాలు’పై పుణెలోని సావిత్రిబాయి ఫులే యూనివర్సిటీలో ప్రసంగించిన సీడీఎస్‌ జనరల్ చౌహాన్‌..


అంతర్జాతీయంగా సంఘర్షణల స్వభావం, పెరుగుతున్న సాంకేతిక ముప్పు, భారత్‌ సుదీర్ఘ కాలంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న తీరును వివరించారు. ఈ సందర్భంగా ఆపరేషన్‌ సిందూర్‌ను (Operation Sindoor)


ప్రస్తావిస్తూ.. నష్టాలు ముఖ్యం కాదని, తుది ఫలితం ఏంటన్నదే ముఖ్యమన్నారు. * పాక్‌ ప్రగల్భాలు అన్నీ అబద్ధాలు! ‘‘ఇరు దేశాలు వివిధ రకాల సైనిక సామర్థ్యాలను అభివృద్ధి చేసుకున్నాయి. యుద్ధక్షేత్రంలో


మాత్రం వాటిని పరీక్షించలేదు. రిస్క్‌ తీసుకోకుంటే.. విజయం సాధించలేరు. మనవద్ద అత్యుత్తమమైన యాంటీ డ్రోన్‌సిస్టమ్‌ ఉందని మనకు తెలుసు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలోనూ ఓవైపు పోరాటం, మరోవైపు రాజకీయ


పరిణామాలు ఒకేసారి చోటుచేసుకున్నాయి. ఇక నష్టాల గురించి నన్ను అడిగితే.. అవి ముఖ్యం కాదు. ఎలా స్పందించాం.. ఫలితం ఏంటన్నదే ముఖ్యం. నష్టాలు, ఎదురుదెబ్బలు అనేవి సైన్యంపై ప్రభావం చూపవు. యుద్ధంలో..


ఎదురుదెబ్బలు ఎదురైనా మనోబలం ఎంతో ముఖ్యం’’ అని జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ (CDS Anil Chauhan) స్పష్టం చేశారు. 20వేల మందిని కోల్పోయాం.. ‘‘పహల్గాం ఘటన (Pahalgam Attack) అత్యంత క్రూరమైనది. కుటుంబీకుల


కళ్ల ముందే అత్యంత దారుణానికి ఒడిగట్టారు. మతం పేరుతో చంపడం ఆధునిక ప్రపంచంలో ఆమోదయోగ్యం కాదు. ఈ ఘటన సమాజంలో ప్రకంపనలు సృష్టించింది. సుదీర్ఘకాలంగా భారత్‌ ఎదుర్కొంటున్న ఉగ్రదాడులను ఈ ఘటన మళ్లీ


గుర్తుచేసింది. పాశ్చాత్య దేశాలు ఒకటి, రెండు ఉగ్రదాడులు ఎదుర్కొంటే.. భారత్‌లో జరిగిన వందలాది ఉగ్రదాడుల్లో 20వేల మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు’’ అని సీడీఎస్ చౌహాన్‌ ఆవేదన


వ్యక్తంచేశారు.