Operation sindoor: బ్రహ్మోస్తో.. శత్రువుకు నిద్రలేని రాత్రులు : మోదీ

Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో స్వదేశీ ఆయుధ శక్తికి యావత్ ప్రపంచం కళ్లారా చూసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను మన క్షిపణి
వ్యవస్థలు ధ్వంసం చేశాయన్నారు. బ్రహ్మోస్ క్షిపణులు.. శత్రువులకు నిద్రలేని రాత్రులు మిగిల్చాయని అన్నారు. ఉత్తర్ప్రదేశ్లోని కాన్పుర్ సభలో మాట్లాడిన మోదీ.. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని
స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భారత సైన్యం పనితీరుపై ప్రధాని (Narendra Modi) ప్రశంసలు కురిపించారు. ‘‘ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు. స్వదేశీ ఆయుధ సామర్థ్యం, మేకిన్ ఇండియా (Make in India)
శక్తిని ఇది ప్రపంచానికి చూపించింది. పాకిస్థాన్లో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రస్థావరాలను నాశనం చేశాం. భారత ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి శత్రువులను
గడగడలాడించాయి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాన్పుర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ఆయన.. అమేఠీలోని ఏకే203 రైఫిల్ ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. * మా సైన్యం మేల్కొనేలోపే
భారత్ దాడి చేసింది - పాక్ ప్రధాని భారత సైన్యం దాడులకు దిగివచ్చిన పాకిస్థాన్.. యుద్ధాన్ని ముగించాలంటూ వేడుకుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అణ్వాయుధ బెదిరింపులకు భారత్ భయపడదని, దాని
ఆధారంగా నిర్ణయాలు తీసుకోదన్నారు. పాకిస్థాన్ కుట్రలు, కుతంత్రాలు ఇక పనిచేయవని స్పష్టం చేశారు. ప్రతి ఉగ్రదాడికి తగిన సమాధానం చెప్పడమే భారత్ సిద్ధాంతమన్నారు. అందుకు సమయం, అనుసరించే విధానాన్ని
సాయుధ బలగాలే నిర్ణయిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.