Jammu and kashmir: జమ్మూకశ్మీర్‌లో లొంగిపోయిన ఇద్దరు లష్కరే తయ్యిబా ఉగ్రవాదులు

Jammu and kashmir: జమ్మూకశ్మీర్‌లో లొంగిపోయిన ఇద్దరు లష్కరే తయ్యిబా ఉగ్రవాదులు

Play all audios:


ఇంటర్నెట్‌డెస్క్‌: పహల్గాం ఘటన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో ఉగ్రవాదుల కోసం అధికారులు ముమ్మర వేట కొనసాగుతోంది. ఈక్రమంలో నిషేధిత లష్కరే తయ్యిబాతో సంబంధాలున్న ఇద్దరు ఉగ్రవాదులు


పోలీసులకు లొంగిపోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘కశ్మీర్‌లోని బస్కుచాన్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించాయి. ఈక్రమంలోనే స్థానికంగా ఉన్న ఒక తోటలో


ఉగ్రవాద కదలికలు ఉన్నట్లు సమాచారం మాకు అందింది. వెంటనే భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈక్రమంలో లష్కరే తయ్యిబాకు చెందిన ఇర్ఫాన్‌ బషీర్‌, ఉజైర్‌ సలామ్‌లు లొంగిపోయారు. వారి నుంచి


రెండు ఏకే-56 రైఫిళ్లు, 4 మ్యాగజైన్లు, రెండు హ్యాండ్‌ గ్రెనేడ్‌లు, మందుగండు సామగ్రితో సహా కొంత నగదు స్వాధీనం చేసుకున్నాం. దీనిపై కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నాం’’ అని


పేర్కొన్నారు.  * యూపీలో ఎన్‌కౌంటర్‌.. బిష్ణోయ్‌ గ్యాంగ్‌ షార్ప్‌ షూటర్‌ మృతి ఏప్రిల్‌ 22న పహల్గాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్‌ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి (Pahalgam


Terror Attack) పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు భారత బలగాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఈక్రమంలోనే ఉగ్రవాదులు


లొంగిపోయినట్లు తెలుస్తోంది.