Kubera: ఎంత నెగెటివ్ ప్రచారం చేస్తారో చేయండి.. : ధనుష్ పవర్ఫుల్ స్పీచ్

Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: ‘కుబేర’తో బాక్సాఫీసు వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యారు నటుడు ధనుష్ (Dhanush). ఆయన, నాగార్జున కలిసి నటించిన చిత్రం ‘కుబేర’ (Kubera) . ఈ పాన్ ఇండియా చిత్రాన్ని శేఖర్
కమ్ముల తెరకెక్కించారు. రష్మిక (Rashmika) కథానాయికగా నటించారు. ఇది జూన్ 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా తాజాగా చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ఇందులో ధనుష్
పవర్ఫుల్ స్పీచ్తో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. ‘‘నేనెప్పుడు నా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తుంటాను. నాపై, నా సినిమాలపై ఎంత నెగెటివ్ ప్రచారం చేస్తారో చేసుకోండి. నా సినిమాల
విడుదలకు ముందు నెలకు రెండుసార్లు ఏదోఒక విషయంలో కుట్రలు చేస్తూనే ఉంటారు. అయినా మీరేం చేయలేరు. ఎందుకంటే నా అభిమానులు ఎప్పుడూ నాతో ఉన్నారు. ఇలాంటి సర్కస్లు మానుకోండి. ఇక్కడ ఉన్నవారంతా నా
అభిమానులు మాత్రమే కాదు.. వీరంతా 23 సంవత్సరాలుగా నా వెంటే ఉంటున్నారు. మీరెంత నెగెటివి ప్రచారం చేసినా వీరంతా ఎప్పటికీ నాతోనే ఉంటారు’’ అని ధనుష్ పవర్ఫుల్ స్పీచ్తో అదరగొట్టారు. * జూన్
అంతా.. అగ్రతారలదే ఇక అభిమానులను ఉద్దేశిస్తూ సంతోషం ఎప్పుడూ మనలోనే ఉంటుందని దాన్ని బయట వెతుక్కోవద్దని సూచించారు. ‘‘ఆనందంగా జీవించాలని మనం బలంగా కోరుకోవాలి. అది మనలోనే.. మనతోనే ఉంటుంది. నా
వరకూ నేను మంచి భోజనం చేసి సంతోషిస్తాను. అదే నాకు ఆనందం. మన సంతోషానికి మించింది ఏమీ ఉండదు’’ అని తెలిపారు. ఇక ఇదే ఈవెంట్లో దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ధనుష్ నటనపై ప్రశంసలు
కురిపించారు. ‘కుబేర’లో ఈ పాత్ర ధనుష్ కాకుండా మరెవ్వరూ చేయలేరన్నారు. అద్భుతంగా నటించారని.. నేషనల్ అవార్డు కచ్చితంగా వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. అలాగే ధనుష్ దర్శకత్వంలో నటించాలనుందని
నాగార్జున అన్నారు. అతను గొప్ప నటుడని ప్రశంసించారు. ఇంత గొప్ప చిత్రంలో భాగమైనందుకు ఎంతో గర్వంగా ఉందని రష్మిక తెలిపారు. ఈ కథ తనకెంతో నచ్చిందన్నారు.