Vijay kanakamedala: ఆ పోస్టు నేను పెట్టలేదు.. : ట్రోల్స్‌పై స్పందించిన ‘భైరవం’ దర్శకుడు

Vijay kanakamedala: ఆ పోస్టు నేను పెట్టలేదు.. : ట్రోల్స్‌పై స్పందించిన ‘భైరవం’ దర్శకుడు

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ సినిమాల స్ఫూర్తితోనే దర్శకుడు కావాలన్న లక్ష్యంతో ఇండస్ట్రీలోకి వచ్చానని, అలాంటి వారిని ఎందుకు దూరం చేసుకుంటానని విజయ్‌ కనకమేడల (Vijay


Kanakamedala) అన్నారు. తన ఫేస్‌బుక్‌ ఖాతాలోని ఓ పోస్టుపై ఆయా హీరోల ఫ్యాన్స్‌ నుంచి ట్రోల్స్‌ ఎదుర్కొంటున్నానని పేర్కొన్న ఆయన వారికి క్షమాపణలు చెప్పారు. తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయి


ఉంటుందన్నారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘‘మేం ఈ నెల 18న ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశాం. అప్పటి నుంచి నాపై సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్ జరుగుతోంది. అయితే దానికి


ముందు నుంచే ఆయా హీరోల అభిమానులు నాకు సపోర్ట్‌గా ఉన్నారు. కానీ, ఈ రోజు ఆ ఫ్యాన్స్‌ నుంచీ విమర్శలొచ్చినట్టు తెలిసింది. 2011లో నా ఫేస్‌బుక్‌ ఖాతాలో నేను ఓ పోస్ట్ పెట్టానంటూ ట్రోల్ చేస్తున్నారు.


అది నేను పెట్టిన పోస్ట్ కాదు. అకౌంట్‌ హ్యాక్ అయి ఉంటుంది. నేను అందరు హీరోలతో కలిసి పని చేశా. ఎక్కువగా వర్క్‌ చేసింది మెగా ఫ్యామిలీ హీరోలతోనే. వారందరితో నాకు సాన్నిహిత్యం ఉంది. పవన్ కల్యాణ్‌


‘గబ్బర్ సింగ్’ సినిమాకి పని చేసిన సమయంలో ఆయన నన్ను ప్రోత్సహించారు. ఆ టైమ్‌లోనే.. సాయి దుర్గాతేజ్‌ని పరిచయం చేసి, ‘మంచి కథ ఉంటే అతడితో సినిమా తెరకెక్కించు’ అని అన్నారు. తేజ్‌తో నాకు మంచి


అనుబంధం ఉంది. నన్ను అన్నా అని పిలుస్తారాయన. అలాంటిది నేను వారి అభిమానులను ఎందుకు దూరం చేసుకుంటా’’ * ఆ ద్వీపానికి ఎవరెళ్లినా చంపేస్తారు.. వాళ్లింకా హంటర్‌ గ్యాదరర్సే: పూరి జగన్నాథ్‌


‘‘అందరిలాగే నేనూ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చా. నేనెందుకు వాళ్లను దూరం చేసుకుంటా. అలాంటి తప్పు ఎందుకు చేస్తాను? నా సోషల్ మీడియా పేజీ కాబట్టి బాధ్యత తీసుకుంటున్నా.


మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటా. ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటా. ఎందుకంటే ఓ వైపు నా సినిమాపై ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చు. ఇలా మరోసారి జరగదు. మెగా ఫ్యామిలీ


హీరోల అభిమానులందరికీ.. మీలో ఒకడిగా నేను హామీ ఇస్తూ మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నా’’ అని తన పోస్టులో పేర్కొన్నారు. ‘నాంది’, ‘ఉగ్రం’ తర్వాత విజయ్‌ తెరకెక్కించిన ‘భైరవం’లో బెల్లంకొండ


సాయిశ్రీనివాస్‌, మంచు మనోజ్‌, నారా రోహిత్‌ హీరోలు. ఈ నెల 30న విడుదల కానుంది.