Rajat patidar: ఈ ట్రోఫీకి అందరికంటే ఎక్కువ అర్హుడు కోహ్లీనే: రజత్ పటీదార్

Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం ఐపీఎల్ (IPL) ఛాంపియన్గా నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru). ఈసారి కొత్త కెప్టెన్గా వచ్చిన రజత్ పటీదార్
(Rajat Patidar).. ఆ జట్టు చిరకాల స్వప్నాన్ని సాకారం చేశాడు. దీంతో ఆర్సీబీ (RCB) అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక జట్టు విజయంపై రజత్ పటీదార్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ (Virat
Kohli)ని ఆకాశానికెత్తాడు. ఇది తనకు లభించిన గొప్ప అవకాశమని పేర్కొన్నాడు. ‘‘విరాట్ కోహ్లీ నుంచి నేర్చుకోవడానికి ఇది నాకు లభించిన గొప్ప అవకాశం. ఐపీఎల్లో ఈ ట్రోఫీని పొందడానికి ఇతరుల కంటే
ఎక్కువగా విరాట్ కోహ్లీ అర్హుడు. ఎందుకంటే 18 సీజన్లుగా ఒకే ఫ్రాంచైజీకి అతడు ఆడుతున్నాడు’’ అని పటీదార్ అన్నాడు. ‘‘ఈ విజయం నాకు, విరాట్ కోహ్లీకి, మా జట్టు అభిమానులకు నిజంగా ఎంతో ప్రత్యేకం.
అభిమానులు మాకు సంవత్సరాలుగా మద్దతు ఇస్తున్నారు. ఇక స్లో పిచ్పై 190 పరుగులు కూడా మంచి స్కోరే. ఓ సమయంలో ఈ పిచ్పై మా బ్యాటర్లు పరుగులు త్వరగా ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నలు వచ్చాయి. అయితే.. ఆ
తర్వాత పంజాబ్ కూడా ఈ పిచ్పై ఇబ్బంది పడింది. మా బౌలర్లు జట్టు ప్రణాళికలను చక్కగా అమలు చేశారు’’ అని పటీదార్ తెలిపాడు. ఇక రెండు వికెట్లు తీసి పంజాబ్ను నిలువరించిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
కృనాల్ పాండ్య బౌలింగ్పై కూడా పటీదార్ ప్రశంసల వర్షం కురిపించాడు.