Ind vs eng: దూబెకు తలనొప్పి లక్షణాలు.. అందుకే కంకషన్ సబ్స్టిట్యూట్: మోర్నీ మోర్కెల్

Play all audios:

India vs England: కంకషన్ సబ్స్టిట్యూట్ వివాదం ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో కొత్త చర్చకు తెర తీసింది. అయితే, తమకున్న అవకాశాలను వినియోగించుకున్నట్లు భారత కోచ్ మోర్నీ మోర్కెల్ వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ (IND vs ENG)లో భారత్ జట్టు విజయం సాధించింది. శివమ్ దూబె స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన హర్షిత్ రాణా బౌలింగ్ చేశాడు. మూడు
వికెట్లు తీసి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. దీంతో చివరివరకూ బ్యాటింగ్ చేసిన దూబెకు సడెన్గా ఎందుకు కంకషన్ అవసరమయ్యాడు? హర్షిత్ను ఎందుకు తీసుకున్నారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.
వాటికి భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సమాధానం ఇచ్చాడు. అలాగే షమీకి చివరి టీ20 మ్యాచ్లో ఆడించే అవకాశం ఉందని వెల్లడించాడు. * టీ20 మ్యాచ్లో ఎంట్రీపై వివాదం.. నాకూ అప్పుడే తెలిసింది:
హర్షిత్ రాణా ‘‘నాకు తెలిసి శివమ్ దూబె (Shivam Dube) బ్యాటింగ్ సమయంలో హెల్మెట్కు బంతి తాకింది. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో కాస్త తలనొప్పి లక్షణాలు మొదలైనట్లు తెలిపాడు. దీంతో అతడికి బదులు
మరొకరి పేరును మ్యాచ్ రిఫరీకి తెలియజేశాం. సరైన సబ్స్టిట్యూట్ పేరును ఇచ్చాం. ఆ తర్వాత రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో హర్షిత్ (Harshit Rana) డిన్నర్ చేస్తున్నాడు. అతడు చాలా వేగంగా
సిద్ధమై ఫీల్డింగ్కు వెళ్లాడు. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఎవరినైనా ఆడించే అధికారం మాకు లేదు. మేం కేవలం పేరు ఇవ్వడం వరకే. ఆ తర్వాత మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకుంటారు. అది మా చేతుల్లో ఉండదు.
రిఫరీ నుంచి అనుమతి రావడంతోనే ఆ ఛాన్స్ను సద్వినియోగం చేసుకున్నాం’’ అని మోర్కెల్ తెలిపాడు. షమీకి అవకాశం ఇస్తాం.. ‘‘మూడో టీ20 మ్యాచ్లో షమీ (Shami) బౌలింగ్ చాలా బాగుంది. వార్మప్లోనూ చాలా
చక్కగా బంతులేశాడు. దాదాపు 14 నెలల తర్వాత భారత జట్టులోకి వచ్చాడు. తప్పకుండా తదుపరి మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. అయితే, మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. కానీ, జట్టులో అతడు ఉండటం చాలా ఉత్సాహంగా
ఉంటుంది. కేవలం తన పనేంటో చూసుకోవడమే కాకుండా.. కుర్రాళ్లకు మార్గదర్శిగా నిలుస్తాడు. తన అనుభవాన్ని యువ ఆటగాళ్లతో పంచుకొంటాడు’’ అని మోర్నీ వ్యాఖ్యానించాడు.