Sachin - kohli: ‘కోహ్లీ నిరీక్షణ 18 ఏళ్లే.. సచిన్ అంతకంటే ఎక్కువ కాలం వేచి ఉన్నాడు’

Play all audios:

18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్లో ఆర్సీబీ (Royal Challengers Bengaluru) తొలి టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఓ
విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో ఆర్సీబీ (Royal Challengers Bengaluru) ఎట్టకేలకు తొలి టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్ 2025లో
ఆర్సీబీ ఛాంపియన్గా అవతరించింది. దీంతో ఆ జట్టుతోపాటు విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ఐపీఎల్ టైటిల్ కల సాకారమైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఓ
విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. కోహ్లీ ఐపీఎల్ టైటిల్ కోసం 18 ఏళ్లు నిరీక్షిస్తే.. సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) వన్డే ప్రపంచ కప్ కలను సాకారం చేసుకోవడానికి అంతకంటే ఎక్కువ కాలం వేచి
చూశాడని సెహ్వాగ్ పేర్కొన్నాడు. 2011 ప్రపంచకప్తో సచిన్ ప్రపంచ కప్ కల నెరవేరిన సంగతి తెలిసిందే. * ‘బెంగళూరు తొక్కిసలాట’.. తప్పెవరిది? బాధ్యతగా ఉండాల్సింది ఎవరు? ‘ఐపీఎల్ ట్రోఫీని గెలవడానికి
కోహ్లీ కేవలం 18 సంవత్సరాలు వేచి చూశాడు. వన్డే ప్రపంచ కప్ కలను సాకారం చేసుకోవడానికి సచిన్ తెందూల్కర్ 1989 నుంచి 2011 వరకు వేచి ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే కోహ్లీ నిరీక్షించింది తక్కువ కాలమే.
ప్రపంచ కప్ కోసం సుదీర్ఘకాలం వేచి చూసిన సచిన్ ఎప్పుడూ ఆశను కోల్పోలేదు. చివరకు వరల్డ్ కప్ సాధించాలనే కోరికను నెరవేర్చుకున్నాడు. విరాట్ కోహ్లీ కూడా అంతే. ఇప్పుడు అతను ఉపశమనం పొందవచ్చు.
ఐపీఎల్కు రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి విచారం లేకుండా సంతోషంగా ఆ నిర్ణయం తీసుకోవచ్చు. ఏ ఆటగాడైనా ట్రోఫీని గెలవడం కోసం ఆడతాడు. డబ్బు వస్తుంటుంది.. పోతుంటుంది. కానీ, ట్రోఫీలు
గెలవడం అంత సులభం కాదు’ అని సెహ్వాగ్ వివరించాడు.