Shubman gill: కెప్టెన్గా నీ ప్రవర్తనే ఇప్పుడు చాలా ముఖ్యం: గిల్కు గావస్కర్ సూచన

Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: టెస్టు ఫార్మాట్కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు యువ ఆటగాడు శుభ్మన్ గిల్ (Shubman Gill). అతడి నాయకత్వంలో ఇంగ్లాండ్ టూర్కు
వెళ్లే జట్టును ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. దీనిపై టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) స్పందిస్తూ.. కొత్త సారథికి కీలక సూచన చేశాడు. ఇప్పుడు గిల్ ప్రవర్తనే చాలా
కీలకమన్నాడు. ‘‘భారత కెప్టెన్గా ఎన్నికైన ఆటగాడిపై సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. జట్టులో సభ్యుడిగా కొనసాగటానికి, కెప్టెన్గా వ్యవహరించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే.. జట్టులో
సభ్యుడిగా ఉన్నప్పుడు నీకు సన్నిహితంగా ఉండే తోటి ఆటగాళ్లతో ముచ్చటిస్తూనే ఉంటావు. కానీ, సారథిగా బాధ్యతలు అందుకున్న తర్వాత.. మిగిలిన వారిని గౌరవించేలా నీ ప్రవర్తన ఉండాలి. కెప్టెన్కు ఎప్పుడైనా
తన ఆటతీరు కంటే ప్రవర్తనే చాలా ముఖ్యం’’ అని గావస్కర్ సూచించాడు. * ఎలా గెలవాలో వాళ్లు చూపించారు: శుభ్మన్ గిల్ కెప్టెన్సీపై గిల్ స్పందిస్తూ.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్పై
ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ‘‘రోహిత్, విరాట్, అశ్విన్ విదేశాల్లో ఎలా ఆడాలి.. సిరీస్లు ఎలా గెలవాలో చూపించారు. వీరి స్ఫూర్తితోనే ముందుకు సాగుతా’’ అని అన్నాడు. జూన్ 20 నుంచి
ఇంగ్లాండ్, భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. దీనికి గిల్ సారథిగా ఎంపిక కాగా.. మరో యువ ఆటగాడు రిషభ్ పంత్కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. మొత్తం 18 మందితో శనివారం బీసీసీఐ
టెస్టు జట్టును ప్రకటించారు. ఐపీఎల్లో అదరగొడుతున్న సాయి సుదర్శన్ సహా కొందరు యువ ఆటగాళ్లు ఇంగ్లాండ్ సిరీస్కు జట్టులో చోటు దక్కించుకున్నారు.