Mp laxman: అన్న ఆధిపత్యాన్ని సవాల్ చేయడమే కవిత లక్ష్యం: భాజపా ఎంపీ లక్ష్మణ్

Play all audios:

భారాసలో ఎలాంటి కోటరీ ఉందో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ (MP Laxman) అన్నారు. దిల్లీ: భారాసలో ఎలాంటి కోటరీ ఉందో ఎమ్మెల్సీ కవిత
(MLC Kavitha) వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ (MP Laxman) అన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘కేసీఆర్ను (KCR) స్వయంగా కుమార్తెనే
కలిసే పరిస్థితి లేదని తెలుస్తోంది. కేటీఆర్ను (KTR) సవాల్ చేస్తున్నట్లు కవిత లేఖ, వ్యాఖ్యలు ఉన్నాయి. కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించేది లేదని ఆమె చెప్పకనే చెప్పారు. అన్న ఆధిపత్యాన్ని సవాల్
చేయడమే కవిత లక్ష్యమని తెలుస్తోంది. ఆమె లేఖలో కాంగ్రెస్పై ప్రేమ, భాజపాపై ద్వేషం కనిపిస్తోంది. సామాజిక తెలంగాణ గురించి ఆమె మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలను పదేళ్లు
పట్టించుకోని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు’’ అని లక్ష్మణ్ విమర్శించారు. (Telangana News)