Naivedyam: దేవతలకు పెట్టే నైవేద్యాన్ని మనం తినొచ్చా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Naivedyam: దేవతలకు పెట్టే నైవేద్యాన్ని మనం తినొచ్చా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Play all audios:


నైవేద్యం (Naivedyam) అనేది భగవంతుడికి సమర్పించే ఆహారం. ఈ పవిత్రమైన ఆహారాన్ని హిందువులు భక్తితో, నిర్మలమైన మనసుతో తయారుచేస్తారు. ఈ సంప్రదాయం వెనుక అనేక ప్రాముఖ్యతలు ఉన్నాయి. భగవంతుడిపై


కృతజ్ఞతాభావంతో చాలామంది నైవేద్యం సమర్పిస్తారు. ఆ సమయంలో ఆయురారోగ్యాలతో ఆశీర్వదించమని కోరుతారు.నైవేద్యం అనేది పూజ లేదా ఆరాధనలో ముఖ్యమైన భాగం. దీన్ని పరిశుభ్రంగా తయారు చేస్తారు. దానిని


దేవునికి సమర్పించిన తర్వాత సరైన ఆచారాలు, మర్యాదలతో నడుచుకోవాలి. నైవేద్యం అందించేటప్పుడు ప్రజలు కొన్ని సాధారణ తప్పులు చేస్తుంటారు. అలాగే నైవేద్యంగా పెట్టిన పదార్థాలను మనం తినొచ్చా? తింటే


ఎప్పుడు తినాలి? వంటివి చాలా మందికి తెలియవు. వీటికి సమాధానాలు చూద్దాం.సాత్విక ఆహారంసాత్విక ఆహారం స్వచ్ఛమైనది, ఆరోగ్యకరమైనది, ఆధ్యాత్మిక వృద్ధికి అనుకూలమైనది. ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి


లేదా జంతు ఉత్పత్తులు ఉండవు. ఉల్లిపాయలు, మాంసం వంటి వాటిని అశుద్ధంగా పరిగణిస్తారు. అవి మనస్సు, శరీరానికి భంగం కలిగిస్తాయి. కాబట్టి దేవతలకు నైవేద్యంగా సాత్విక ఆహారాన్ని మాత్రమే దేవుళ్లకు


సమర్పించాలి. లడ్డూ, ఖీర్, తీపి పాలు, పండ్లు, కూరగాయలు సాత్విక ఆహారానికి కొన్ని ఉదాహరణలు. అయితే పుట్టగొడుగులు వంటి కొన్ని కూరగాయలు చీకటి, తడిగా ఉన్న ప్రదేశాలలో పెరుగుతాయి కాబట్టి వాటిని కూడా


నైవేద్యంగా పెట్టకూడదు.కొత్త, శుభ్రమైన పాత్రలునైవేద్యం తయారు చేయడానికి, వడ్డించడానికి ఉపయోగించే పాత్రలు కొత్తవి అయి ఉండాలి, లేదా శుభ్రంగా ఉంచుకోవాలి. అవి రోజూ వాడేవిగా ఉండకూడదు. కొత్త పాత్రల


ద్వారా దేవతలపై గౌరవం, భక్తి తెలియజేయవచ్చు. పాత్రలు కూడా మట్టి, రాగి, ఇత్తడి లేదా వెండి వంటి సహజ పదార్థాలతో తయారై ఉండాలి. నైవేద్యాన్ని నేలపై కాకుండా ఏదైనా శుభ్రమైన వస్త్రం లేదా చిన్న బల్ల మీద


పెట్టాలి. దీనివల్ల నైవేద్యం కలుషితం కాదు, కీటకాలు ముట్టవు.నైవేద్యం రుచి చూడకూడదునైవేద్యం దేవతలకు పూర్తి విశ్వాసం, ప్రేమతో సమర్పించాలి. సమర్పించే ముందు దీనిని రుచి చూడకూడదు. ఇలాంటి పనులు


దేవతల పట్ల అనుమానం లేదా అగౌరవాన్ని సూచిస్తాయి. నైవేద్యం తాజా, శుభ్రమైన పదార్థాలతో తయారు చేయాలి. దేవతల ఇష్టానుసారం మసాలా దినుసులను సర్దుబాటు చేయాలి. ఉదాహరణకు, కొంతమంది దేవుళ్లు తీపి ఆహారాన్ని


ఇష్టపడతారు, మరికొందరు కారంగా ఉండే ఆహారాన్ని ఇష్టపడతారు.నైవేద్యం తినడానికి సరైన సమయంనైవేద్యం పెట్టిన వెంటనే తీయకూడదు లేదా తినకూడదు. ఇది దేవతల పట్ల అసహనం లేదా మొరటుతనాన్ని చూపుతుంది. నైవేద్యం


కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు దేవతల ముందు ఉంచాలి. తద్వారా దేవుళ్ళు వాటిని ప్రశాంతంగా ఆస్వాదిస్తారు. ఈ సమయంలో భగవంతుడికి కొంత ప్రైవసీ కల్పించేలా కర్టెన్లు కూడా వేయాలి. తరువాత, నైవేద్యం


తిరిగి తీసుకోవచ్చు, తినవచ్చు లేదా ప్రసాదంగా అందరికీ పంచి పెట్టవచ్చు.నైవేద్యం దానం చేయాలినైవేద్యం మొత్తం చేసిన వారే తినేయకూడదు లేదా ఎక్కువ కాలం ఇంట్లో ఉంచకూడదు. ఇలా చేస్తే ప్రతికూల శక్తి


పెరిగిపోతుంది, ఆహారం కూడా పాడైపోతుంది. నైవేద్యం అవసరమైన వారికి దానం చేయాలి లేదా భక్తులకు ప్రసాదంగా పంచాలి. దీనివల్ల భగవంతుని అనుగ్రహం అందరికీ అందుతుంది. నైవేద్యం భక్తితో, కృతజ్ఞతతో తినాలి,


అత్యాశతో లేదా అనుబంధంతో కాదు. నైవేద్యం అనేది పూజ లేదా ఆరాధనలో ముఖ్యమైన భాగం. దీన్ని పరిశుభ్రంగా తయారు చేస్తారు. దానిని దేవునికి సమర్పించిన తర్వాత సరైన ఆచారాలు, మర్యాదలతో నడుచుకోవాలి.


నైవేద్యం అందించేటప్పుడు ప్రజలు కొన్ని సాధారణ తప్పులు చేస్తుంటారు. అలాగే నైవేద్యంగా పెట్టిన పదార్థాలను మనం తినొచ్చా? తింటే ఎప్పుడు తినాలి? వంటివి చాలా మందికి తెలియవు. వీటికి సమాధానాలు


చూద్దాం. సాత్విక ఆహారం సాత్విక ఆహారం స్వచ్ఛమైనది, ఆరోగ్యకరమైనది, ఆధ్యాత్మిక వృద్ధికి అనుకూలమైనది. ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి లేదా జంతు ఉత్పత్తులు ఉండవు. ఉల్లిపాయలు, మాంసం వంటి వాటిని


అశుద్ధంగా పరిగణిస్తారు. అవి మనస్సు, శరీరానికి భంగం కలిగిస్తాయి. కాబట్టి దేవతలకు నైవేద్యంగా సాత్విక ఆహారాన్ని మాత్రమే దేవుళ్లకు సమర్పించాలి. లడ్డూ, ఖీర్, తీపి పాలు, పండ్లు, కూరగాయలు సాత్విక


ఆహారానికి కొన్ని ఉదాహరణలు. అయితే పుట్టగొడుగులు వంటి కొన్ని కూరగాయలు చీకటి, తడిగా ఉన్న ప్రదేశాలలో పెరుగుతాయి కాబట్టి వాటిని కూడా నైవేద్యంగా పెట్టకూడదు. advertisement కొత్త, శుభ్రమైన పాత్రలు


నైవేద్యం తయారు చేయడానికి, వడ్డించడానికి ఉపయోగించే పాత్రలు కొత్తవి అయి ఉండాలి, లేదా శుభ్రంగా ఉంచుకోవాలి. అవి రోజూ వాడేవిగా ఉండకూడదు. కొత్త పాత్రల ద్వారా దేవతలపై గౌరవం, భక్తి తెలియజేయవచ్చు.


పాత్రలు కూడా మట్టి, రాగి, ఇత్తడి లేదా వెండి వంటి సహజ పదార్థాలతో తయారై ఉండాలి. నైవేద్యాన్ని నేలపై కాకుండా ఏదైనా శుభ్రమైన వస్త్రం లేదా చిన్న బల్ల మీద పెట్టాలి. దీనివల్ల నైవేద్యం కలుషితం కాదు,


కీటకాలు ముట్టవు. advertisement నైవేద్యం రుచి చూడకూడదు నైవేద్యం దేవతలకు పూర్తి విశ్వాసం, ప్రేమతో సమర్పించాలి. సమర్పించే ముందు దీనిని రుచి చూడకూడదు. ఇలాంటి పనులు దేవతల పట్ల అనుమానం లేదా


అగౌరవాన్ని సూచిస్తాయి. నైవేద్యం తాజా, శుభ్రమైన పదార్థాలతో తయారు చేయాలి. దేవతల ఇష్టానుసారం మసాలా దినుసులను సర్దుబాటు చేయాలి. ఉదాహరణకు, కొంతమంది దేవుళ్లు తీపి ఆహారాన్ని ఇష్టపడతారు, మరికొందరు


కారంగా ఉండే ఆహారాన్ని ఇష్టపడతారు. నైవేద్యం తినడానికి సరైన సమయం నైవేద్యం పెట్టిన వెంటనే తీయకూడదు లేదా తినకూడదు. ఇది దేవతల పట్ల అసహనం లేదా మొరటుతనాన్ని చూపుతుంది. నైవేద్యం కనీసం 15 నుంచి 30


నిమిషాల పాటు దేవతల ముందు ఉంచాలి. తద్వారా దేవుళ్ళు వాటిని ప్రశాంతంగా ఆస్వాదిస్తారు. ఈ సమయంలో భగవంతుడికి కొంత ప్రైవసీ కల్పించేలా కర్టెన్లు కూడా వేయాలి. తరువాత, నైవేద్యం తిరిగి తీసుకోవచ్చు,


తినవచ్చు లేదా ప్రసాదంగా అందరికీ పంచి పెట్టవచ్చు. advertisement నైవేద్యం దానం చేయాలి నైవేద్యం మొత్తం చేసిన వారే తినేయకూడదు లేదా ఎక్కువ కాలం ఇంట్లో ఉంచకూడదు. ఇలా చేస్తే ప్రతికూల శక్తి


పెరిగిపోతుంది, ఆహారం కూడా పాడైపోతుంది. నైవేద్యం అవసరమైన వారికి దానం చేయాలి లేదా భక్తులకు ప్రసాదంగా పంచాలి. దీనివల్ల భగవంతుని అనుగ్రహం అందరికీ అందుతుంది. నైవేద్యం భక్తితో, కృతజ్ఞతతో తినాలి,


అత్యాశతో లేదా అనుబంధంతో కాదు. Location : Hyderabad,Telangana First Published : January 25, 2024 6:17 PM IST