వడదెబ్బ తగిలిందా.. ఇలా చేస్తే ప్రాణం కాపాడిన వారవుతారు..

Play all audios:

Reported by: Published by: Last Updated:March 31, 2024 9:39 PM IST రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు పలు హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ
వేసవి కాలం సందర్భంగా వడదెబ్బ తగిలే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. X వేములవాడ సీనియర్ వైద్యులు మనోహర్ రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు పలు హెచ్చరికలు జారీ
చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ వేసవి కాలం సందర్భంగా వడదెబ్బ తగిలే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అయితే వడ దెబ్బ తగిలితే ముందుగా చేయవాల్సిన ప్రథమ చికిత్సలు ఏమిటి..!? ఎలాంటి ప్రథమ
చికిత్సలు చేయాలనే అంశంపై లోకల్18 ప్రత్యేక కథనం మీకోసం అందిస్తోంది.అధిక మండువేసవిలో దూర ప్రయాణాలు కానీ.. పనులు చేయడం వంటి వాటి ద్వారా వడదెబ్బ తగిలే ఆస్కారం ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ పట్టణానికి చెందిన సీనియర్ వైద్యులు మనోహర్ తెలిపారు. ఎండాకాలం నేపథ్యంలో వ్యవసాయ కూలీలు మరియు ముఖ్యంగా దూరప్రాంతాలు ప్రయాణించే వాహనదారులు కూడా ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవడం ద్వారా
డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటారని, సమయపాలన పాటిస్తూ అధిక వేడి ఉన్న సమయాల్లో కాకుండా ఎండ తీవ్రత తక్కువగా ఉన్న సమయాల్లో పనులు అనుగుణంగా చేసుకోవాలని కార్మికులకు, వ్యవసాయ కూలీలకు, రైతులకు కూడా
వైద్యులు సూచిస్తున్నారు. అధిక మండువేసవిలో దూర ప్రయాణాలు కానీ.. పనులు చేయడం వంటి వాటి ద్వారా వడదెబ్బ తగిలే ఆస్కారం ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన సీనియర్ వైద్యులు
మనోహర్ తెలిపారు. ఎండాకాలం నేపథ్యంలో వ్యవసాయ కూలీలు మరియు ముఖ్యంగా దూరప్రాంతాలు ప్రయాణించే వాహనదారులు కూడా ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటారని, సమయపాలన
పాటిస్తూ అధిక వేడి ఉన్న సమయాల్లో కాకుండా ఎండ తీవ్రత తక్కువగా ఉన్న సమయాల్లో పనులు అనుగుణంగా చేసుకోవాలని కార్మికులకు, వ్యవసాయ కూలీలకు, రైతులకు కూడా వైద్యులు సూచిస్తున్నారు. advertisement
వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లని ప్రాంతంలోకి తరలించి, ఒంటిపై ఉన్న దుస్తులను వదులు చేసి వాటర్ తాగించడం కానీ, ఒంటిని చల్లని గుడ్డతో తుడవాలని, చల్లని వాతావరణంలోకి, నీడలోకి తీసుకు వచ్చిన
తర్వాత వడదెబ్బ తాకిన వ్యక్తి దుస్తులను వదులు చేసి కొన్ని మంచినీరు త్రాగించాలని వైద్యులు చెబుతున్నారు. అయినా కూడా వడదెబ్బ తాకిన వ్యక్తి పరిస్థితి బాగా లేకుంటే త్వరగా దగ్గరలోని ఆసుపత్రికి
తరలించి వైద్యం అందించాలని సూచిస్తున్నారు. advertisement సాధ్యమైనంతవరకు గత వేసవితో పోలిస్తే ఈ వేసవిలో అధిక శాతం ఎండలు ఉండే అవకాశం ఉందని ఉష్ణోగ్రత రోజురోజుకీ పెరుగుతుందని వారు చెబుతున్నారు.
దీంతో వడదెబ్బలు తగిలే ఆస్కారం కూడా అధికంగా ఉందని,ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ ఈ వేసవికి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత 40 సంవత్సరాలుగా వేములవాడ పట్టణంలో నాణ్యమైన
వైద్య సేవలు అందిస్తున్నానని డాక్టర్ మనోహర్ లోకల్18 తో తెలిపారు. తన ఆసుపత్రిలో నాణ్యమైన స్టాఫ్ తో కూడిన అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని, 24గంటలు నాణ్యమైన వైద్య సేవలు గత 40 ఏండ్లుగా
వేములవాడ పట్నంతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. Location : Sircilla,Karimnagar,Telangana First Published : March 31, 2024 9:38 PM IST Read More