Mclr: రుణ వడ్డీ రేట్లను పెంచిన బీఓబీ, యూబీఐ

Mclr: రుణ వడ్డీ రేట్లను పెంచిన బీఓబీ, యూబీఐ

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రుణ వడ్డీ రేట్లను (ఎంసీఎల్‌ఆర్‌) పెంచాయి. 2022 మే నెలలో ఆర్‌బీఐ రెపో రేటును పెంచడం ప్రారంభించినప్పటి నుంచి బ్యాంకులు


రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తన ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను అన్ని కాలవ్యవధులకు 10 నుంచి 15 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. బ్యాంకు ఒక సంవత్సరపు ఎంసీఎల్‌ఆర్‌ 7.95% నుంచి


8.05%కు పెరిగింది. ఈ కొత్త రేట్లు 2022 నవంబరు 12 నుంచి అమల్లోకి వస్తాయి. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అన్ని కాలవ్యవధులకు ఎంసీఎల్‌ఆర్‌ను 30 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఈ పెంపుతో ఎంసీఎల్‌ఆర్‌


7.15% నుంచి 7.45%కు పెరిగింది. బ్యాంకు వెబ్‌సైట్‌ ప్రకారం సవరించిన వడ్డీ రేట్లు 2022 నవంబరు 11 నుంచి 2022 డిసెంబరు 10 వరకు అమల్లో ఉంటాయి. రుణగ్రహీతలు ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లతో గృహ రుణాలు


తీసుకున్నట్లయితే వారి ఈఎంఐలలో పెరుగుదల కనిపిస్తుంది.