Tantex literary forum: వేడుకగా ‘టాంటెక్స్‌’ నెలనెలా తెలుగు వెన్నెల 213వ సాహిత్య సదస్సు

Tantex literary forum: వేడుకగా ‘టాంటెక్స్‌’ నెలనెలా తెలుగు వెన్నెల 213వ సాహిత్య సదస్సు

Play all audios:


డాలస్‌: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక నెల నెలా తెలుగు వెన్నెల 213వ సాహిత్య సదస్సు ఈనెల 18న డాలస్‌లో జరిగింది. ‘‘హృద్యమైన పద్య ప్రయాణం’’ అంశంపై ముఖ్య అతిథి పేరి భార్గవి


ప్రసంగం సాహితీ ప్రియులను విశేషంగా అలరించింది. తొలుత సమన్విత మాడా వీనులవిందుగా ఆలపించిన త్యాగరాజ కీర్తన ‘గజాననమ్‌ తం గణేశ్వరం’ ప్రార్థన గీతంతో సదస్సు ప్రారంభమైంది. సంస్థ సమన్వయకర్త దయాకర్


మాడా స్వాగత వచనాలు పలుకుతూ.. టాంటెక్స్ 200వ సదస్సుకు ప్రముఖ కవి వడ్డేపల్లికృష్ణ రాసిన ‘నెల నెలా  తెలుగు వెన్నెల’ గీత వైశిష్ట్యాన్ని  కొనియాడుతూ.. ఆ సుమధుర గీతాన్ని వినిపించారు. సంస్థ సమన్వయ


కర్త దయాకర్ మాడా.. టాంటెక్స్ 200వ సదస్సుకు వడ్డేపల్లికృష్ణ రాసిన ‘వెన్నెలా  వెన్నెల తెలుగు వెన్నెలా’’ రికార్డు చేసిన గీతాన్ని మరొకసారి వినిపించారు. అనంతరం ముఖ్య అతిథిని సాహితీ ప్రియులకు


పరిచయం చేశారు. ప్రధాన వక్త పేరి భార్గవి మాట్లాడుతూ... పద్యరచనలో అడుగుపెట్టిన తరువాతి సంఘటనల క్రమాన్ని చక్కగా వివరించారు. పద్యరచనలో తనచేత ఓనమాలు దిద్దించిన డాక్టర్  కొల్లారపు ప్రకాశరావుశర్మ,


కొంపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ, నేమాని శ్రీనివాసరావు, కంది శంకరయ్యకు తానెంతో రుణపడినట్టు చెప్పారు. ముఖ్యంగా సాహిత్య, సాంస్కృతిక సామాజిక వికాస సంస్థ గా ‘తెలుగురథం’ సంస్థకు శ్రీకారం చుట్టిన


కొంపెల్ల బాల సుబ్రహ్మణ్యశర్మ వద్ద విద్యార్థినిగా చేరి వివిధ ఛందస్సులతో పద్యాలు రాయడం నేర్చుకొన్నట్లు తెలిపారు. ఒక్కొక్క శతకంలో ఐదేసి పద్యాలు రాయమని ప్రోత్సహించిన గురువులను ఈజన్మకు


మరచిపోవడమంటూ జరగదని పేర్కొన్నారు.  ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సమన్వయకర్త దయాకర్ మాడ.. ముఖ్య అతిథి పేరి భార్గవికి  సంస్థ తరఫున సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి ఘనంగా


సన్మానించారు. ఇంతమంది సాహితీప్రియుల మధ్య తనకు జరిగిన ఈసన్మానం అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని పేరి భార్గవి  కృతజ్ఞతను వెలిబుచ్చారు. తన జీవిత  చరమాంకంలో పద్యరచన చేసిన తనను ఆదర్శంగా తీసుకొని


కొంతమంది సాహితీ ప్రియులైనా పద్యరచన నేర్చుకొని ఇంకొతమంది శతక రచనకు పూనుకొనేలా చేయడమే తన జీవితాశయమన్నారు. మహాకవి కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకం నుంచి శకుంతల దుష్యంతుల కథను డాక్టర్


వీఎన్‌ రాజ్యలక్ష్మి  ప్రస్తావించారు. డాక్టర్ నక్త రాజు మాతృత్వము, స్త్రీశక్తిని గురించి చెప్పే గొప్ప శ్లోకాలను, శ్రీలలితాసహస్ర నామ శ్లోకాల నుంచి ఎంచుకొన్న కొన్నింటిని భావయుక్తంగా వివరించారు.


ప్రముఖ సాహితీ ప్రియులు డాక్టర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి తన ప్రసంగంలో.. మాతృప్రేమపై ప్రముఖ కవి సినారే రాసిన ‘‘అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు’’ పాట పాడి వినిపించారు. సంస్థ తక్షణ పూర్వాధ్యక్షులు


సతీష్ బండారు, సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, డాక్టర్ నరసింహ రెడ్డి ఊరిమిండి ,చిన్న సత్యం వీర్నాపు,  డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి , ప్రపంచ తెలుగు


సమాఖ్య చెన్నై కార్యవర్గ సభ్యులు యాలమూరి రంగారావు, లెనిన్ బంద, వీర లెనిన్ తుళ్లూరి, సత్యం ఉపద్రష్ట, బాలా త్రిపుర సుందరి, లక్ష్మి యద్దనపూడి, విజయలక్ష్మి కందిబండ, విజయ్ మామునూరి, లెనిన్ వేముల,


కిరణ్మయి వేముల, శారదా సింగి రెడ్డి, శ్రీనివాస కుమార్ రాజా, గౌతమి పాణ్యం, డాక్టర్ నక్త రాజు, రామ్ సీత మూర్తి, కాశీనాధుని రాధ, డాక్టర్ వీఎన్ రాజ్యలక్ష్మి, విజయ మామునూరి, నవీన్ గొడవర్తి ,


గోవర్ధనరావు నిడిగంటితో పాటు అనేక మంది సాహితీ ప్రియులు పాల్గొని వీక్షించడంతో సదస్సు విజయవంతమైంది. వందన సమర్పణ గావించిన దయాకర్ మాడ సంస్థ పూర్వాధ్యక్షులకు, సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా


తోడ్పడుతున్న దాతలకు,   కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు  చంద్రశేఖర్


పొట్టిపాటి, పాలకమండలి ఉపాదిపతి, సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడా, సంస్థ పాలక మండలి, అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనీయులని కొనియాడారు.