Stock market: లాభాల్లో దేశీయ మార్కెట్లు.. 25వేల మార్క్‌ దాటిన నిఫ్టీ

Stock market: లాభాల్లో దేశీయ మార్కెట్లు.. 25వేల మార్క్‌ దాటిన నిఫ్టీ

Play all audios:


Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో మొదలయ్యాయి. కార్పొరేట్‌ కంపెనీల ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్లలోని సంకేతాలతో ఈ వారాన్ని సానుకూలంగా


ప్రారంభించాయి. నిఫ్టీ 25వేల మార్కును దాటింది. నెలవారీ డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగియనున్న నేపథ్యంలో అంచనాల తగ్గట్టే లాభాల్లో నిలిచింది. ఉదయం 9.29 గంటల సమయంలో సెన్సెక్స్‌ 639 పాయింట్లు


పుంజుకొని 82,360 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 195 పాయింట్లు ఎగబాకి 25,048 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 44 పైసలు పెరిగి, 85.01 వద్ద ఉంది. నిఫ్టీ సూచీలో ఎంఅండ్‌ఎం,


పవర్‌ గ్రిడ్ కార్పొరేషన్, హిందాల్కో, టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. ఎటర్నల్‌, సిప్లా స్టాక్స్‌ నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఆసియా మార్కెట్‌ సూచీలు


మిశ్రమంగా కదలాడుతున్నాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. కాగా.. ఈయూ సుంకాలపై ట్రంప్ వెనక్కి తగ్గారు. వాణిజ్య చర్చల గడువును జులై 9 వరకు పొడిగించారు. ఈయూ దేశాలపై 50 శాతం సుంకం


విధిస్తామని, జూన్‌ 1 నుంచి కొత్త టారిఫ్‌ అమల్లోకి వస్తుందని గతంలో ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. రుతు పవనాల కారణంగా ద్విచక్ర, ట్రాక్టర్‌ తయారీ కంపెనీలపైనే మదుపర్లు దృష్టి


పెట్టనున్నారు. అరబిందో ఫార్మా, సుందరం ఫైనాన్స్, బేయర్‌ క్రాప్‌సైన్స్, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, నజారా టెక్నాలజీస్, శిల్పా మెడికేర్, జీఐసీ, పవర్‌గ్రిడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌


బోర్డ్ ట్రస్ట్‌.. సమావేశాలు జరగనున్నాయి. దాంతో వాటిపై మదుపర్లు దృష్టి పెట్టారు.