Ipl top 2 race: టాప్‌ 2 రేసు రసవత్తరం.. ఆ టీమ్స్‌కు ఎలిమినేటైన జట్లు షాకిస్తే?

Ipl top 2 race: టాప్‌ 2 రేసు రసవత్తరం.. ఆ టీమ్స్‌కు ఎలిమినేటైన జట్లు షాకిస్తే?

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్: ఐపీఎల్‌ (IPL)లో ప్లేఆఫ్స్‌ రేసు ముగిసింది. ఇక మిగిలింది టాప్‌ 2 కోసం పోరు మాత్రమే. ప్లేఆఫ్స్‌ చేరిన గుజరాత్‌ టైటాన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌,


ముంబయి ఇండియన్స్‌ జట్లు.. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచేందుకు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడికి చేరిన జట్లకు క్వాలిఫయర్‌లో ఓడినా..  మరో అవకాశం ఉంటుంది. మరోవైపు


టేబుల్‌లో అట్టడుగున ఉన్న జట్లు.. టాప్‌ 2 రేసుపై ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగానే  ఉన్నాయి. దీంతో ఈ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. గుజరాత్‌ (GUJARAT TITANS) కు ఇలా.. * పాయింట్ల పట్టికలో


టాప్‌లో కొనసాగుతున్న గుజరాత్‌కు.. ప్లేఆఫ్స్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన లఖ్‌నవూ గత మ్యాచ్‌లో షాకిచ్చింది. దీంతో ఆ జట్టు టాప్‌ 2 అవకాశాలు క్లిష్టంగా మారాయి. * గుజరాత్‌ మరో మ్యాచ్‌ మాత్రమే ఆడాల్సి


ఉంది. అందులో గెలిచినా ఆ జట్టు ఖాతాలో చేరేవి 20 పాయింట్లు. * అప్పుడు గుజరాత్‌ టాప్‌ 2 భవితవ్యాన్ని ఆర్సీబీ, పంజాబ్‌ తేల్చనున్నాయి. * ఒకవేళ అట్టడుగున ఉన్న చెన్నై.. చివరి మ్యాచ్‌లో గుజరాత్‌కు


షాకిస్తే శుభ్‌మన్‌ గిల్‌ సేన మూడో స్థానానికి పడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆర్సీబీ  (ROYAL CHALLENGERS BENGALURU) భవితవ్యం ఇలా.. * 17 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్న బెంగళూరు..


తదుపరి మ్యాచ్‌లు సన్‌రైజర్స్‌, లఖ్‌నవూతో ఆడనుంది. * ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తే.. టాప్‌ 1లోకి వచ్చే అవకాశం ఉంది.  * ఒకవేళ సన్‌రైజర్స్‌, లఖ్‌నవూ షాకిస్తే మాత్రం.. ఆర్సీబీ టాప్‌ 2 అవకాశాలు


గల్లంతే. * సన్‌రైజర్స్‌ ఇప్పటికే లఖ్‌నవూను ప్లేఆప్స్‌నకు దూరం చేసింది. ఇక గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌కు లఖ్‌నవూ షాకిచ్చింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. పంజాబ్‌ (PUNJAB KINGS)


కింగ్స్‌ దూసుకెళ్తుందా..? * 11 ఏళ్ల తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టు పంజాబ్‌.. 17 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. * దిల్లీ, ముంబయితో తదుపరి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ


రెండింటిలో గెలిస్తే.. 21 పాయింట్లతో టాప్‌ 2లోకి వెళ్లే అవకాశం ఉంది.   * ఒక్కటి ఓడినా.. పైనున్న జట్ల ఫలితాలపై దీని టాప్‌ 2 భవితవ్యం ఆధారపడి ఉంది. ముంబయి (MUMBAI INDIANS)కి కష్టమే.. * ముంబయి


ఆడాల్సింది ఒక మ్యాచ్‌ మాత్రమే.. అదీనూ టాప్‌ 3లో ఉన్న పంజాబ్‌తో. * పంజాబ్‌పై ఓడితే పాండ్య సేన నాలుగో స్థానంలోనే ఉంటుంది. * పంజాబ్‌పై గెలిచినా.. ముంబయి ఖాతాలో చేరేవి 18 పాయింట్లు. అప్పుడు


టాప్‌ 2లోకి చేరాలంటే.. మిగతా మూడు జట్లు రాబోయే అన్ని మ్యాచ్‌లు ఓడిపోవాలి. _ఇక ఇప్పటికే ఎలిమినేటై పరువు కోసం చెన్నై, హైదరాబాద్‌, లఖ్‌నవూ, దిల్లీ ఆడుతున్నాయి. ఆఖరి మ్యాచ్‌ల్లో ఆ జట్లు


విజృంభిస్తే.. ప్లేఆఫ్స్‌కు చేరిన జట్లకు కష్టాలు తప్పవు. దీంతో ప్రతి మ్యాచ్‌ ఫలితం. నెట్‌ రన్‌రేట్‌ టాప్‌ 4 జట్లకు కీలకంగా మారనుంది._ __