Subramanya swamy: నాగుల చవితి రోజు ఇక్కడ సుబ్రమణ్య స్వామిని దర్శిస్తే సంతానం కలుగుతుందట!

Play all audios:

Reported by: Published by: Last Updated:November 02, 2024 2:28 PM IST ఇప్పటివరకు వందలాది మంది దంపతుల కోరికలు ఈ ఆలయంలో నెరవేరినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. X TEMPLE మీకు లేదా మీ బంధువులకు
సంతాన సమస్యలు ఉన్నాయా? ఇంకా వివాహం కాక సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే, ఒక ప్రత్యేక ఆలయాన్ని సందర్శించడం ద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు. ఏడాది
పొడవునా అక్కడ స్వామిని దర్శించుకుని పాలు సమర్పించడం ఒక విధానం. అయితే, నాగుల చవితి రోజున ప్రత్యేకంగా అక్కడికి చేరుకుని పాలు సమర్పిస్తే, ఈ సమస్యలు తీరి, సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.
మరి ఈ పవిత్రమైన ఆలయం ఎక్కడుంది? ఆ విశేషాలు తెలుసుకుందాం. చిన్న షిరిడిగా ప్రసిద్ధి పొందిన సుభద్రమ్మపేట కాకినాడ జిల్లా రూరల్ ప్రాంతంలో ఉన్న సుభద్రమ్మపేట అనే గ్రామాన్ని స్థానికులు "చిన్న
షిరిడి"గా పిలుస్తారు. ఈ గ్రామంలో వనుములమ్మ కొండపై, అనేక శతాబ్దాల క్రితం స్వయంభుగా సుబ్రహ్మణ్య స్వామి వారి పవిత్ర పుట్ట వెలిసింది. భక్తులు ఇప్పటికీ ఈ పుట్టలో స్వయంభుగా నాగేంద్రుడు
ఉన్నారని విశ్వాసంతో చెబుతారు. సంతానం కోసం స్వామి సేవ సంతానం కోసం ఆకాంక్షించే భక్తులు ప్రతి గురువారం బాబా వారిని దర్శించుకుని, అభిషేకం చేసిన పాలను ఈ పుట్టలో వేసి మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే
స్వామి అనుగ్రహం కలుగుతుందని అంటున్నారు. దీనివల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, ఇంకా వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశముందని ఆలయ గురువులు తెలియజేస్తున్నారు. advertisement నాగుల
చవితి ప్రత్యేకత సంవత్సరంలో నాగుల చవితి రోజున స్వామి అనుగ్రహం అత్యంత శ్రేష్ఠంగా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు. ఆ రోజున సుభద్రమ్మపేట వనుములమ్మ కొండపైకి వచ్చి స్వయంభు పుట్టలో పాలు
పోస్తే స్వామి అనుగ్రహం కలుగుతుందని వారు చెబుతున్నారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు, వివాహం కాని వారు నాగుల చవితి రోజు స్వామి ఆలయానికి విచ్చేసి పాలు సమర్పిస్తే వారి కోరికలు నెరవేరతాయని
విశ్వాసం. advertisement వందలాది మంది కోరికలు తీరిన చరిత్ర ఇప్పటివరకు వందలాది మంది దంపతుల కోరికలు ఈ ఆలయంలో నెరవేరినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. వివాహం కాని వారు ఈ పుట్టలో పాలు పోయడం ద్వారా
వివాహం జరిగిందని, ఇంకా కొందరికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. నాగుల చవితి రోజు స్వామిని దర్శించుకోవడం ద్వారా మరింత దైవ అనుగ్రహం లభిస్తుందని స్థానికులు
నమ్ముతున్నారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ రోజున ఆలయానికి చేరుకుంటారు కాబట్టి, వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు ఆళ్ల నాగేశ్వరరావు తెలిపారు. advertisement ఎక్కడ
ఉంది ఈ ఆలయం? ఈ ప్రాంతానికి చేరుకోవడానికి కాకినాడ నుంచి కోటనందూరు వెళ్లే బస్సు అందుబాటులో ఉంది. మార్గమధ్యంలో డిపోలవరం గ్రామం కనిపిస్తుంది, దాని పక్కనే సుభద్రమ్మపేట గ్రామం ఉంది. ఈ గ్రామంలోనే ఈ
పవిత్రమైన ఆలయం వెలసి ఉంది. Location : East Godavari,Andhra Pradesh First Published : November 02, 2024 2:27 PM IST Read More