Hyderabad: షో వేయలేదని ప్రేక్షకుల రచ్చ రచ్చ.. థియేటర్పై దాడి

Play all audios:

Reported by: Published by: Last Updated:April 24, 2023 12:39 PM IST హైదరాబాద్ (HYDERABAD) సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేటలో ఉన్న లక్ష్మికళ థియేటర్ పై సాయి ధరమ్ తేజ్ (SAI DHARAM
TEJ) ఫ్యాన్స్ దాడి చేశారు. టికెట్ కొనుకొని థియేటర్ లోకి వెళ్లిన తర్వాత రెండు గంటలైనా సినిమా వేయకపోవడంపై ఫాన్స్ ఫైర్ అయ్యారు. X హైదరాబాద్ లక్ష్మీకళ థియేటర్ పై ప్రేక్షకుల దాడి DASTAGIR AHMED,
NEWS18, HYDERABAD హైదరాబాద్ (Hyderabad) సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేటలో ఉన్న లక్ష్మికళ థియేటర్ పై సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఫ్యాన్స్ దాడి చేశారు. టికెట్ కొనుకొని థియేటర్
లోకి వెళ్లిన తర్వాత రెండు గంటలైనా సినిమా వేయకపోవడంపై ఫాన్స్ ఫైర్ అయ్యారు. దీంతో ప్రేక్షకులు సహనం కోల్పోయారు. థియేటర్ పై దాడి చేశారు. థియేటర్ అద్దాలు, ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. హుటాహుటిన
అక్కడికి చేరుకున్న పోలీసులు ఫ్యాన్స్ కు సర్ది చెప్పారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు సాయి ధరమ్ తేజ్ నటించిన విరుపాక్ష సినిమా (Viroopaksha Movie) సమయానికి ప్రారంభం కాకపోవడంతో అప్పటికే టికెట్స్
తీసుకొని లోపలికి వెళ్లిన ఆడియన్స్ అసహనం వ్యక్తం చేశారు. advertisement థియేటర్ లోకి వెళ్లి గంటన్నర సమయమైన సినిమా తెరపై విరూపాక్ష ప్రదర్శించకపోవడంతో, థియేటర్ లోపల అద్దాలు పగలగొట్టారు. దీంతో
సనత్ నగర్ పోలీసులు రంగంలోకి దిగి గొడవను తగ్గించారు. ఆడియన్స్ కోపాన్ని కంట్రోల్ చేసి థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి టికెట్ కొన్న ప్రేక్షకులకు డబ్బు వాపస్ ఇప్పించారు. అయితే డబ్బు వాపస్ చేసే
సమయంలో కూడా వెయ్యి మందిని ఒకే క్యూ లైన్ లో నిల్చోపెట్టి చాలా ఇబ్బంది పెట్టారని ఓ ప్రేక్షకులు ఆరోపించారు. థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. Location :
Hyderabad,Hyderabad,Telangana First Published : April 24, 2023 12:39 PM IST Read More