Crime news: జీడిమెట్లలో మావోయిస్టుల పేరుతో లేఖ.. నిందితుల అరెస్ట్

Play all audios:

షాపూర్నగర్: జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో మావోయిస్టుల లేఖ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 21న మావోయిస్టుల పేరుతో నిందితులు లేఖ రాశారు. వారిని కూన రాఘవేందర్గౌడ్
ఇంట్లో అద్దెకు ఉంటున్న రాజు, అతడి స్నేహితుడిగా గుర్తింంచారు. నిందితుల వద్ద నాటుబాంబులు, 3 సెల్ఫోన్లు, 2 బెదిరింపు లేఖలను స్వాధీనం చేసుకున్నారు. నాటుబాంబులను వారు విజయనగరంలో కొనుగోలు
చేసినట్లు తెలిసింది. (Crime News) అసలేం జరిగిందంటే.. మేడ్చల్ జిల్లాలోని షాపూర్నగర్లో మావోయిస్టు పేరుతో బెదిరింపు లేఖ కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుడి
కుటుంబాన్ని లేఖలో లక్ష్యంగా చేసుకున్నారు. రూ.50 లక్షలు ఇవ్వకపోతే కూన రవీందర్గౌడ్ కుమారుడు కూన రాఘవేందర్ గౌడ్ను చంపుతామని అందులో పేర్కొన్నారు. రెండు ఇళ్లను బాంబులతో పేల్చేస్తామని
హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తి ఇంటి ముందు వస్తువులు ధ్వంసం చేసి అక్కడ లేఖను ఉంచారు. కారుపై ఎరుపు రంగు టవల్లో లేఖ పెట్టి వెళ్లిపోయారు. ఘటన ఈ నెల 21న జరిగినట్లు రాఘవేందర్గౌడ్
పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల్లో ఓ వ్యక్తి మాస్క్ ధరించి వచ్చినట్లు గుర్తించారు. తాజాగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.
(Telangana News)