Bullet train: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అప్డేట్.. వీడియో షేర్ చేసిన రైల్వేమంత్రి

Play all audios:

Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన కొత్త అప్డేట్ను రైల్వేమంత్రి వెల్లడించారు. దిల్లీ:
అహ్మదాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ (Ahmedabad-Mumbai Bullet Train) ప్రాజెక్ట్లో భాగంగా మరో అడుగుపడింది. 300 కి.మీ. వంతెన (viaducts) పూర్తయిందని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini
Vaishnaw) వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వీడియో షేర్ చేశారు (Mumbai-Ahmedabad bullet train project). దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు అహ్మదాబాద్-ముంబయి మధ్య పనులు శరవేగంగా
కొనసాగుతున్నాయి. ఈ రైలు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. ఒకసారి ఈ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాక అహ్మదాబాద్ నుంచి ముంబయి కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చు. గుజరాత్లో మొత్తం 8 స్టేషన్లు
ఉండగా.. మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉన్నాయి. బుల్లెట్ ట్రైన్ తొలి ట్రయల్స్ను 2026లో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ట్రయల్ రన్లో భాగంగా గంటకు 350 కి.మీ. వేగంతో బుల్లెట్ ట్రైన్
పరుగులు పెడుతుందని, ఇది విమానం టేకాఫ్ అయ్యే వేగంతో సమానమని తెలిపారు. అయితే, ప్రజలకు అందుబాటులోకి వచ్చాక గరిష్ఠంగా 320 కి.మీ. వేగంతో నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ విలువ
రూ.1.08 లక్షల కోట్లు. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు.