Arunachal pradesh: అరుణాచల్లో పరీక్ష.. 2600 కి. మీ. దూరం నుంచి అందిన జవాబులు

Play all audios:

కొన్ని రకాల డివైజ్లు వినియోగించి పరీక్షల్లో కాపీ కొట్టేందుకు ప్రయత్నించిన 50 మందికి పైగా విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్నెట్డెస్క్: టెక్నాలజీతో అడ్డదారిన పరీక్షల్లో ఉత్తీర్ణత
సాధించాలని ప్రయత్నించిన 50 మందికి పైగా హరియాణా (Haryana) విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అరుణాచల్ప్రదేశ్లో బోధనేతర పోస్టులకు జరిగిన పరీక్షల్లో ఎలక్ట్రానిక్ డివైజ్లు వినియోగించి
జవాబులు రాసేందుకు యత్నించిన విద్యార్థులు అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. 2,600 కి.మీ.ల దూరం నుంచి వీరికి జవాబులు అందడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. అరుణాచల్ప్రదేశ్ (Arunachal Pradesh)లో
ఈనెల 18న నవోదయ విద్యాలయ సమితిలో బోధనేతర పోస్టులకు సంబంధించిన సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించారు. కింగ్కప్లోని ఒక పరీక్ష కేంద్రంలో పరీక్ష రాస్తున్న ఒక విద్యార్థి వైఖరి అక్కడి సిబ్బందికి
అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆ విద్యార్థిని పరీక్షించారు. అతడి వద్ద నుంచి చిన్నపాటి ఎలక్ట్రానిక్ డివైజ్,
చిన్న ఇయర్పిన్ను అధికారులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. 53 మంది విద్యార్థులు పట్టుబడ్డారు. వారి నుంచి 29 పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. * ఆపరేషన్
సిందూర్.. పాక్ ఆట కట్టించిన 3వేల మంది అగ్నివీరులు 2,600 కి.మీ.ల దూరం నుంచి నిందితులకు డైరెక్ట్గా జవాబులు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం కూడా
లీకైనట్లు అనుమానిస్తున్నారు. మరికొన్ని పరీక్షా కేంద్రాల్లో కూడా ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ విద్యార్థులకు సహకరించిన నెట్వర్క్ను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు
పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామన్నారు.