Pakistan: ఉద్రిక్తతల వేళ.. పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌కు ప్రమోషన్‌

Pakistan: ఉద్రిక్తతల వేళ.. పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌కు ప్రమోషన్‌

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ(Operation Sindoor) దాయాది దేశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్కడి సైన్యాధ్యక్షుడు జనరల్‌ ఆసిం మునీర్‌కు ప్రభుత్వం


ప్రమోషన్‌ ఇచ్చింది. దేశంలో అత్యున్నత సైనిక హోదా కలిగిన ‘ఫీల్డ్‌ మార్షల్‌’గా నియమించేందుకు అక్కడి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం


తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఆసిం మునీర్‌ కీలక పాత్ర వహించినట్లు దాయాది దేశం భావిస్తోందట. ఇందులో తామే పైచేయి సాధించినట్లు చెబుతున్నట్లు


సమాచారం. ఇలా వారి సాయుధ బలగాలను ముందుండి నడిపించినందుకే ఆర్మీ చీఫ్‌కు తాజా ప్రమోషన్‌ కట్టబెట్టినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌


సిందూర్‌’(Operation Sindoor) ద్వారా పాక్‌లోని ఉగ్ర, సైనిక స్థావరాలను తీవ్రంగా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి అనేక ఆధారాలను కూడా భారత సైన్యం(Indian Army) విడుదల చేసింది. ఈ


క్రమంలో పదుల సంఖ్యలో పాకిస్థాన్‌ సైనికులు, అధికారులు మృతి చెందారని, అనేకమంది పాక్‌ సైనికులు గాయపడినట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ తమదే పైచేయి అని భ్రమలో ఉన్న పాకిస్థాన్‌..


తమ సైన్యాధ్యక్షుడికి పదోన్నతి కల్పించడం గమనార్హం.