Tdp mahanaadu: విజనరీ లీడర్ మన చంద్రబాబు: హోం మంత్రి అనిత

Play all audios:

నాడు పసుపు చొక్కా వేసుకున్నారని కేసులు పెట్టి బెదిరించిన నేపథ్యం నుంచి ఈ రోజు ధైర్యంగా పసుపు చొక్కా వేసుకుని, పసుపు టోపీ, జెండా పట్టుకొని కడప గడ్డపై కదం తొక్కిన ప్రతి కార్యకర్తకు శిరస్సు
వంచి పాదాభివందనం చేస్తున్నానని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కడప: నాడు పసుపు చొక్కా వేసుకున్నారని కేసులు పెట్టి బెదిరించిన నేపథ్యం నుంచి ఈ రోజు ధైర్యంగా పసుపు చొక్కా వేసుకుని, పసుపు టోపీ,
జెండా పట్టుకొని కడప గడ్డపై కదం తొక్కిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. మహానాడు బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. మండుటెండను సైతం లెక్క
చేయకుండా రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా పార్టీ శ్రేణులు తరలి వచ్చాయన్నారు. ‘‘కడపలో మహానాడు నిర్వహిస్తున్నామంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. కడప తెలుగు దేశం కంచుకోట అని ఇప్పటికే ప్రజలు
నిరూపించారు. కడపలో ఇప్పటి వరకు మహానాడు నిర్వహించలేదు. ఈసారి నిర్వహిద్దామని సీఎం చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ .. కంకణం కట్టుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
సాధారణంగా ఎవరైనా సీఎం అయితే వచ్చే ఐదేళ్ల గురించి, రాబోయే ఎలక్షన్ల గురించి ఆలోచిస్తారు. అలాంటి వారిని పొలిటికల్ లీడర్ అంటారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భవిష్యత్ గురించి 20 ఏళ్ల తర్వాత
ఏం జరగబోతోందో ఆలోచించే వారిని విజనరీ లీడర్ అంటారు. ఆ విజనరీ లీడరే మన సీఎం చంద్రబాబు. 75 ఏళ్ల వయసు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం.. ఈ రెండూ మేళవించుకొని 2047నాటికి ఆంధ్రపదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో
ఉండాలని చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక యువత తప్పుదారి పట్టారు. అలాంటి యువతను మళ్లీ గాడిలో
పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది’’ అని అనిత తెలిపారు.