Andhra pradesh news: గ్రేడ్ 2 మున్సిపాలిటీలుగా గిద్దలూరు, ఎర్రగుంట్ల

Play all audios:

రాష్ట్రంలో పలు నగర పంచాయతీలు, మున్సిపాలిటీల స్థాయిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి: రాష్ట్రంలో పలు నగర పంచాయతీలు, మున్సిపాలిటీల స్థాయిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
జారీ చేసింది. నగర పంచాయతీలుగా ఉన్న గిద్దలూరు, ఎర్రగుంట్లను గ్రేడ్ 2 మున్సిపాలిటీలుగా.. నరసరావుపేట, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలను గ్రేడ్ 1 మున్సిపాలిటీలుగా స్థాయి పెంచుతూ ఆదేశాలు జారీ అయ్యాయి.
తక్షణమే ఈ మార్పులు అమల్లోకి వస్తాయని పేర్కొంటూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ నోటిఫికేషన్లను జారీ చేశారు. (Andhra Pradesh News)