India: పాక్ సైతం ఉగ్రవాదులను అప్పగించాలి: భారత దౌత్యవేత్త

Play all audios:

ఇంటర్నెట్డెస్క్: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకం కావాలని ఇజ్రాయెల్లోని భారత రాయబారి జేపీ సింగ్ (JP Singh) పిలుపునిచ్చారు. పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)ను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆయన మాట్లాడుతూ అమెరికా తరహాలోనే పాకిస్థాన్ కూడా ఉగ్రవాదులను అప్పగించాలన్నారు. అక్కడి వార్తా
సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. * భారత్కు వ్యతిరేకంగా పాక్కు చైనా సైనిక సాయం చేసిందా..? స్పందించిన బీజింగ్ ‘పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడులకు 26 మంది అమాయకులు ప్రాణాలు
కోల్పోయారు. దీనికి ప్రతిగా భారత్ (India) ఆపరేషన్ సిందూర్ను నిర్వహించి పాక్లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది. కానీ, ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.
ఉగ్రవాదంపై మా పోరాటం కొనసాగుతుంది. అలాంటివారు ఎక్కడున్నా వారిని అంతం చేయడంతో పాటు వారి మౌలిక సదుపాయాలను నాశనం చేస్తాం. భారత్ పాక్కు నీటిని అందిస్తే.. వారు మా దేశంపై ఉగ్రవాదాన్ని
ఎగదోస్తున్నారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని భారత ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. అందుకే సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేశాం’ అని సింగ్ పేర్కొన్నారు. ఇటీవల ముంబయి ఉగ్రదాడులకు
సూత్రధారి అయిన తహవ్వుర్ రాణా (Tahawwur Rana)ను అమెరికా (USA) ఇటీవల భారత్కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. అమెరికా మాదిరిగా భారత్లో ఉగ్రదాడులకు కారణమైన వారిని
పాకిస్థాన్ (Pakistan) ఎందుకు అప్పగించదని ప్రశ్నించారు. కరుడుగట్టిన హఫీజ్ సయీద్, సాజిద్ మీర్, జకియర్ రెహ్మాన్ల వంటి ఉగ్రవాదులను భారత్కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా
ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న దేశాలు దానికి వ్యతిరేకంగా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.