Salman khurshid: కాంగ్రెస్లో థరూర్ ప్రకంపనలు.. ఇప్పుడు అదే బాటలో మరో నేత

Play all audios:

ఇంటర్నెట్డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ బాటలోనే ఆ పార్టీకి చెందిన సల్మాన్ ఖుర్షీద్ (Salman Khurshid).. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడారు.
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దుపై కితాబిచ్చారు. ఆపరేషన్ సిందూర్పై ఏర్పాటైన అఖిలపక్ష బృందంలో భాగంగా ఇండోనేసియాలో పర్యటించిన సందర్భంగా ఖుర్షీద్ ఈ
వ్యాఖ్యలు చేశారు. ‘‘కశ్మీర్కు చాలాకాలం ఒక పెద్ద సమస్య ఉండేది. ప్రత్యేక ప్రతిపత్తి కారణంగా అది దేశంలోని మిగిలిన ప్రాంతాలతో వేరే అనే భావన కలిగించేది. కానీ ఆర్టికల్ 370ని రద్దు చేశారు. చివరకు
ఆ భావనను అంతం చేశారు’’ అని అన్నారు. ఆ ప్రాంతంలో సానుకూల మార్పు, అభివృద్ధివైపు పయనానికి ఈ రద్దు దోహదం చేసిందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. అక్కడ ఎన్నికలు జరిగాయని, 65 శాతం మంది ప్రజలు అందులో
పాల్గొన్నారన్నారు. ఇప్పుడు అక్కడ ఎన్నికైన ప్రభుత్వం ఉందని అన్నారు. * కాంగ్రెస్లో శశిథరూర్ ముసలం ఉగ్రవాదంపై పాకిస్థాన్ (Pakistan) అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు భారత పార్లమెంటరీ
అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు అనుకూల వ్యాఖ్యలు చేస్తూ సీనియర్ నాయకుడు శశిథరూర్ కాంగ్రెస్లో ప్రకంపనలు
సృష్టిస్తున్నారు. ఇండోనేసియా, మలేసియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ దేశాల్లో పర్యటిస్తోన్న బృందంలో సల్మాన్ ఖుర్షీద్ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన కూడా థరూర్ వలే కేంద్రంలో
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. 2019లో ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.