Dadasaheb phalke: రాజమౌళి కాదు.. ఆమిర్‌ టీమ్‌ సంప్రదించింది.. బయోపిక్‌పై స్పష్టత

Dadasaheb phalke: రాజమౌళి కాదు.. ఆమిర్‌ టీమ్‌ సంప్రదించింది.. బయోపిక్‌పై స్పష్టత

Play all audios:


దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌పై ఆయన మనవడు స్పష్టతనిచ్చారు. తనను ఆమిర్‌ టీమ్ మూడేళ్ల క్రితమే సంప్రదించిందన్నారు. ఇంటర్నెట్‌డెస్క్‌: కొన్ని రోజులుగా ఇటు టాలీవుడ్‌ అటు బాలీవుడ్‌లలో చర్చనీయాంశమైన


ప్రాజెక్ట్‌ దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌. ఈ సినిమాను రాజమౌళి (SS Rajamouli) సమర్పణలో ఎస్‌.ఎస్‌.కార్తికేయ, వరుణ్‌గుప్తా నిర్మాతలుగా నితిన్‌ కక్కర్‌ రూపొందించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో


ఎన్టీఆర్‌ నటించనున్నట్లు టాక్‌ వినిపించింది. అటు బాలీవుడ్‌లోనూ ఆమిర్‌ఖాన్‌ - రాజ్‌కుమార్‌ హిరాణీ కలయికలో    ఈ బయోపిక్‌ రూపొందుతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై దాదాసాహెబ్‌


ఫాల్కే (Dadasaheb Phalke) మనవడు చంద్రశేఖర్‌ శ్రీకృష్ణ స్పందించారు. తనను రాజమౌళి బృందం సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రశేఖర్‌ శ్రీకృష్ణ దీనిపై మాట్లాడారు. ‘‘ఈ


ప్రాజెక్ట్‌ రాజమౌళి సమర్పణలో రానున్నట్లు వస్తోన్న వార్తలు నేనూ విన్నాను. కానీ, ఆయన, ఆయన టీమ్‌ వాళ్లు కానీ నాతో ఇప్పటివరకూ మాట్లాడలేదు. ఫాల్కేపై ఎవరైనా సినిమా తీయాలంటే కనీసం


కుటుంబసభ్యులతోనైనా మాట్లాడాలి. ఎందుకంటే ఆయన గురించి మాకే ఎక్కువ తెలుస్తుంది. ఆమిర్‌- రాజ్‌కుమార్‌ హిరాణీ టీమ్‌ మాతో ఎన్నోసార్లు చర్చలు జరిపింది. వాళ్లు ఈ బయోపిక్‌ను రూపొందించడం నాకు ఆశ్చర్యం


కలిగించింది. వాళ్ల అసిస్టెంట్‌ ప్రొడ్యూసర్‌ నాతో మూడు సంవత్సరాలుగా టచ్‌లో ఉన్నారు. ఎన్నోసార్లు కలిశారు. వివరాలు తెలుసుకున్నారు. వాళ్లు నిజాయతీగా పనిచేస్తున్నారు. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.


ఇందులో దాదాసాహెబ్‌ ఫాల్కేగా ఆమిర్‌ (Aamir khan) నటించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన గొప్ప నటుడు, నిబద్ధతతో పని చేస్తారు’’ అన్నారు. ఈ చిత్రంలో దాదాసాహెబ్‌ ఫాల్కే భార్య సరస్వతిబాయ్‌


ఫాల్కే పాత్రకు విద్యాబాలను తీసుకోవాలి ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.  * సామ్‌-రాజ్‌ ప్రయాణం మొదలు.. సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా: నటి నాలుగేళ్లుగా ఈ స్క్రిప్ట్‌కి సంబంధించిన పనులు


జరుగుతున్నాయని, ‘సితారే జమీన్‌ పర్‌’ విడుదలైన వెంటనే ఫాల్కే బయోపిక్‌ కోసం ఆమిర్‌ (AamirKhan) సిద్ధం కానున్నారని, అక్టోబరులో చిత్రీకరణ ప్రారంభమవుతుందని బాలీవుడ్‌ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో


పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర పోరాట నేపథ్యం, భారతీయ సినిమాకి పడిన పునాదుల మేళవింపుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలిసింది.