Bangladesh: యూనస్‌.. బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్‌ హసీనా

Bangladesh: యూనస్‌.. బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్‌ హసీనా

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగ్లాదేశ్‌ ప్రభుత్వ తాత్కాలిక సారథి ముహమ్మద్‌ యూనస్‌పై ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా (Sheikh Hasina) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బంగ్లా అవామీ లీగ్‌ పార్టీపై నిషేధం


విధించడాన్ని తీవ్రంగా ఖండించిన ఆమె.. అది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఉగ్రవాద సంస్థల సాయంతో పాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలో బంగ్లాను అమెరికాకు అమ్మేసేందుకు కుట్ర జరుగుతుందని


పేర్కొంటూ ఓ ఆడియోను విడుదల చేశారు. ‘‘సెయింట్‌ మార్టిన్‌ ద్వీపం కోసం అమెరికా చేసిన డిమాండ్లకు మా నాన్న (షేక్‌ ముజిబుర్‌ రహ్మాన్‌) అంగీకరించలేదు. అందుకు ఆయన ప్రాణాలను కూడా అర్పించాల్సి


వచ్చింది. అధికారంలో ఉండేందుకు దేశాన్ని విక్రయించాలని నేను ఎప్పుడూ భావించలేదు కాబట్టే నా దుస్థితి ఇలా నెలకొంది. దేశంలోని ఒక్క అంగుళం భూభాగాన్ని ఎవ్వరూ వదులుకోరు. కానీ, ఈ రోజు ఏమిటీ


దౌర్భాగ్యం. దేశంతో పాటు ప్రపంచం మెచ్చిన వ్యక్తికి.. అధికారాన్ని చేపట్టిన తర్వాత ఏమయ్యింది?’’ అని ప్రస్తుత సారథి యూనస్‌ను (Muhammad Yunus) ఉద్దేశిస్తూ షేక్‌ హసీనా ప్రశ్నించారు. * మానవ శరీర


భాగాలు బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయం.. ‘హార్వర్డ్‌’ మాజీ ఉద్యోగి నిర్వాకం ఉగ్రవాద భావజాలమున్న వారి మద్దతుతో యూనస్‌ ప్రభుత్వాన్ని చేపట్టారని షేక్‌ హసీనా ఆరోపించారు. ‘‘నా ప్రభుత్వం పోరాటం చేసిన


వారితో, అంతర్జాతీయంగా నిషేధానికి గురైన వారితో కలిసి ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నారు. ఒక్క ఉగ్రదాడి జరిగితేనే మేం కఠిన చర్యలు తీసుకున్నాం. ఎంతో మందిని అరెస్టు చేశాం. కానీ, ఇప్పుడు జైళ్లన్నీ


ఖాళీగా ఉన్నాయి. అందర్నీ విడిచిపెడుతున్నారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం మిలిటెంట్ల రాజ్యం నడుస్తోంది’’ అని మాజీ ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌ అవామీ లీగ్‌పై నిషేధం విధించడాన్ని షేక్‌


హసీనా తీవ్రంగా తప్పుపట్టారు. అది అక్రమమని, చట్టవిరుద్ధమన్నారు. ‘‘సుదీర్ఘ పోరాటం చేసి దేశాన్ని సాధించుకున్నాం. రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఆయనకు ఎవరిచ్చారు? ఆయనకు ప్రజా మద్దతు లేదు. ఆ పదవి


కూడా ఉనికిలో లేదు. పార్లమెంటు నిర్ణయం లేకుండా చట్టాన్ని ఎలా మారుస్తారు? బంగ్లాదేశ్‌ అవామీ లీగ్‌ను నిషేధించడం చట్టవిరుద్ధం’’ అని మాజీ ప్రధాని మండిపడ్డారు.