Rajnath singh: భారత్‌ను ఆపాలని పాక్‌ ప్రపంచ దేశాలను వేడుకుంది: రాజ్‌నాథ్‌ సింగ్

Rajnath singh: భారత్‌ను ఆపాలని పాక్‌ ప్రపంచ దేశాలను వేడుకుంది: రాజ్‌నాథ్‌ సింగ్

Play all audios:


ఇంటర్నెట్‌డెస్క్‌: భారత నౌకాదళానికి చెందిన విమాన వాహకనౌక ఐఎన్ఎస్‌ విక్రాంత్ (INS Vikrant)ను శుక్రవారం కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) సందర్శించారు. ఈసందర్భంగా ఆయన అక్కడి


అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.  ‘మన దేశం శక్తిమంతమైన దాడులు చేయడంతో భారత్‌ను ఆపాలని పాకిస్థాన్‌ ప్రపంచదేశాలను


వేడుకుంది. మన నిబంధనల ప్రకారమే సైనిక చర్యలను ఆపేశాం. ఆపరేషన్‌ సమయంలో నేవీ పాత్ర అద్భుతమైనది. పాక్‌ గడ్డపై ఉన్న ఉగ్రవాద స్థావరాలను వైమానిక దళం నేలమట్టం చేసింది. అదే సమయంలో మన నావికాదళం


సముద్రంలో చూపిన సంసిద్ధత పాక్‌ నావికాదళాన్ని ఎక్కడికీ కదలనీయకుండా చేసింది. మీ ముందస్తు మోహరింపుతో పాక్‌ ధైర్యంపై దెబ్బకొట్టారు. మీరు పాక్‌పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ సన్నద్ధతే


దాయాదికి గట్టి హెచ్చరిక. భారత నావికాదళ శక్తిని, సైనిక చర్యలను, సామర్థ్యాలను చూసి శత్రుదేశం భయాందోళనకు గురైంది’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా


ముగియలేదని.. ఇచ్చింది విరామమేనని పేర్కొన్నారు. పాక్‌ మరో తప్పు చేస్తే ఈసారి కోలుకునే అవకాశమే లేకుండా గట్టిగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.  * ఉగ్రమూకను మట్టిలో కలిపేశాం: ప్రధాని మోదీ


పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించి పాక్‌లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే  పాక్‌ ప్రతిస్పందనను నావికాదళం పసిగట్టి.. తమ సంసిద్ధతను


గణనీయంగా పెంచడానికి పలు చర్యలు తీసుకుంది. పాక్‌లోని కరాచీ పోర్టు లక్ష్యంగా ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ (INS Vikrant), బ్రహ్మోస్‌ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను మోహరించింది.