Harish rao: కేసీఆర్ నివాసానికి వెళ్లిన హరీశ్రావు

Play all audios:

ఎర్రవల్లిలోని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) నివాసానికి మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) వెళ్లారు. సిద్దిపేట: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR)ను మాజీ మంత్రి హరీశ్రావు (Harish
Rao) కలిశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి ఆయన వెళ్లారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ అంశంలో తదుపరి కార్యాచరణపై నేతలిద్దరూ చర్చించే అవకాశం
ఉంది. కేసీఆర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవల నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీశ్రావు, భాజపా ఎంపీ ఈటల రాజేందర్కూ జారీ చేసింది. 15 రోజుల్లో కమిషన్ ఎదుట హాజరుకావాలని
పేర్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో హరీశ్రావు నీటిపారుదల శాఖ మంత్రి,
ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. (Telangana News)