Hyderabad: చాదర్‌ఘాట్‌లో భారీ చోరీ.. 75 తులాల బంగారు నగలతో ఉడాయించిన దుండగులు

Hyderabad: చాదర్‌ఘాట్‌లో భారీ చోరీ.. 75 తులాల బంగారు నగలతో ఉడాయించిన దుండగులు

Play all audios:


హైదరాబాద్‌: నగరంలోని చాదర్‌ఘాట్‌ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఫహిముద్దీన్‌ అనే వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 75 తులాల బంగారు నగలు, రూ.2.50 లక్షల నగదును దోచుకెళ్లారు. భార్య


అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో..శుక్రవారం రాత్రి ఫహిముద్దీన్‌ తన తల్లిదండ్రుల్ని ఇంట్లో ఉంచి.. ఆస్పత్రికి వెళ్లారు. అదే అదునుగా భావించిన దుండగులు.. ఇంటి వెనుక నుంచి లోపలికి


ప్రవేశించి.. ఫహిముద్దీన్‌ తల్లిదండ్రులు నిద్రిస్తున్న గదికి బయట నుంచి గొళ్లెం పెట్టారు. రిఫ్రిజిరేటర్‌లోని పండ్లు తిని.. బీరువాలోని బంగారం, నగదు, ఇతర వస్తువులను చోరీ చేశారు. తెల్లవారుజామున


ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన ఫహిముద్దీన్‌.. దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న చాదర్‌ఘాట్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.